Friday, April 17, 2026

విస్సాకోడేరులో సాక్షాత్కరించిన దత్త కృప: నా మొదటి దత్త సప్తహం – ఒక అద్భుత అనుభవం

 జీవితంలో కొన్ని సందర్భాలు మనకు దైవంపై నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయి. 2023లో నేను మొదటిసారిగా 'దత్తాత్రేయ పూజ' చేయాలని నిర్ణయించుకున్నాను. లోగడ దత్త సప్తహం చేయడం వల్ల కలిగే సత్ఫలితాల గురించి విన్నాను. కానీ, ఆ ఏడు రోజుల ప్రయాణం నాలో ఇంతటి మార్పును, ఆధ్యాత్మిక ప్రశాంతతను నింపుతుందని నేను ఊహించలేదు.


సప్తహం – ఒక అనుభూతి:

దత్తాత్రేయ స్వామి సప్తహం ప్రారంభించిన రోజు నుండి, రోజురోజుకూ గ్రంథ పారాయణం చేస్తున్న కొద్దీ నాలో తెలియని ఒక ధైర్యం, ఆనందం కలిగేవి. స్వామి వారు భక్తులను సాధు రూపంలోనో, స్వప్న దర్శనం ద్వారానో లేదా ఏదైనా అద్భుతం ద్వారానో అనుగ్రహిస్తారని చదివాను. మనసులో చిన్న ఆశ.. ఆ దత్తప్రభువు కరుణ నాపై కూడా ఉండాలని కోరుకుంటూ సప్తహం పూర్తి చేశాను.

హనుమాన్ ఆలయంలో ఆ అద్భుత క్షణం:

సప్తహం పూర్తయిన రెండు రోజుల తర్వాత, మా ఊరు (భీమవరం దగ్గరలోని విస్సాకోడేరు) లో ఉన్న హనుమాన్ ఆలయం వద్ద నేను పూజలో ఉన్నాను. అప్పుడు ఒక సాధువు అక్కడికి వచ్చారు. ఆయన ఒళ్లంతా విభూతితో నిండి ఉంది. చూస్తుంటేనే ఏదో తెలియని దైవిక కళ ఆయనలో కనిపించింది.


ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆయన కాశీ నుండి కన్యాకుమారి వెళ్తున్నామని చెప్పారు. కానీ భౌగోళికంగా మా ఊరు ఆ మార్గంలో లేదు. అయినప్పటికీ ఆయన మా గ్రామానికి రావడం, నా నుదుట విభూతి పెట్టి దీవించడం, తనతో ఉన్న వారికి భోజనం కావాలని అడగడం.. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒళ్లు గగుర్పొడిచింది



నేను మనస్ఫూర్తిగా చేసిన పూజను స్వీకరించడానికి ఆ దత్తాత్రేయ స్వామియే తన అనుచరులతో కలిసి వచ్చారని లేదా వారిని పంపించారని నాకు అనిపించింది. నేను వారికి భోజనం కోసం సహాయం చేశాను. నమ్మిన వారికి దత్తాత్రేయ స్వామి ఎప్పుడూ తోడుంటారని చెప్పడానికి నా జీవితంలో జరిగిన ఈ సంఘటనే ఒక పెద్ద నిదర్శనం.

దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర!



No comments:

Post a Comment